సంగారెడ్డి జిల్లా ఝరాసంగం లొ గల పవిత్ర పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వర ఆలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఉదయం నుండే అర్చన అభిషేకాల్లో పాల్గొన్న ఆయన బంగారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని అనుగ్రహం అందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపితోపాటు సిడిసి చైర్మెన్ ఉమాకాంత్ పటేల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post