కర్నూలు జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
వీరి వెంట శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు , వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. శ్రీశైల దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు వారికి స్వామి వారి చిత్రపటాన్ని శేష వస్త్రము ప్రసాదాలనుఅందజేశారు.