నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవే పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పీఏ పల్లి మండలం అంగడిపేట స్టేజీ ఎస్సార్ పెట్రోల్ బంకు దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆటోలోని ఐదుగురు మహిళా కూలీలు, ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
మరో 14 మందికి తీవ్రగాయాలు తగిలాయి. వీరిది దేవరకొండ మండలం చింతబాయి గ్రామం అని పోలీసులు తెలిపారు. ఆటోలో 20 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
గాయాలైన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.