31.2 C
Hyderabad
February 14, 2025 21: 20 PM
Slider చిత్తూరు

తిరుపతిలో తొక్కిసలాట: 6 గురి మృతి

#tirupathi

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడు కు చెందిన మల్లిక సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. తొక్కిసలాటలో గాయపడిన మిగిలి వారిని సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు భక్తులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా స్విమ్స్‌లో చికిత్సపొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

Related posts

రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. త‌ప్పిన ముప్పు!

Sub Editor

సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం

Satyam NEWS

ఆంధ్రా బస్సులు ఎక్కద్దు… తెలంగాణ బస్సులు ఎక్కండి

Satyam NEWS

Leave a Comment