30.7 C
Hyderabad
April 19, 2024 09: 37 AM
Slider కడప

రాజంపేట అసెంబ్లీ పరిధిలో ఆరు ఎంపీపీ లు వైసీపీ ఏకగ్రీవం…

#kadapaycp

కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ పరిధిలోని శుక్రవారం ఆరు మండలాలకు వైసీపీ ఎంపీపీల ఎన్నిక, 62 మంది ఎంపీటీసీ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకగా నిర్వహించారు.

ఆయా మండల అభివృద్ధి కార్యాలయాలల్లో ఎంపీడీవో ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధ రెడ్డి రాజంపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం కార్యక్రమంలో పాల్గొని ఎంపీపీ లను,సభ్యులను పూలమాల శాలువాలతో సత్కరించారు.

ఇందులో రాజంపేట నుంచి 16 మంది,నందలూరు నుంచి 11 మంది, ఒంటిమిట్ట నుంచి 9 మంది,సిద్దవటం నుంచి 11 మంది, సుండుపల్లె నుంచి 14 మంది, వీరబల్లె నుంచి10 మంది ఎంపీటీసీ లు మొత్తం 62 ఆరు మంది ఎంపీటీసీ లల్లో మండల పరిషత్ అధ్యక్షులుగా ఆరు మంది ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.

అరు మంది కూడా అధికార వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు బాధ్యతలు స్వీకరించి, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ముస్లింలకు ఖబరస్తాన్ స్థలం కేటాయింపుపై హర్షం

Satyam NEWS

తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ తో పొత్తు లేదు

Satyam NEWS

విజన్ డాక్యుమెంట్: స్థానిక సంస్థలకు అధికారాలేవి?

Satyam NEWS

Leave a Comment