రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 6 గురు మరణించారు. మరో ఆరు మందికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కోండ ఔటర్ రింగ్గురోడ్డు పై బొలోరో వాహనాన్ని ఒక ట్రక్కు ఢీకొన్నది.
మృతులు కర్ణాటక రయచూర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తున్నది. కరోనా వైరస్ కారణంగా పనులు లేకపోవడం వల్ల సొంత ఊరికి వెళ్దామని వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. సూర్యపేట నుండి వీరు బయలు దేరారు. శంషాబాద్ ఔటర్ రింగ్గురోడ్డు వద్దకు రాగానే ట్రాక్కు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నది.