ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లోని పాధమ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ షాపులో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన పై విచారిస్తున్నారు.
previous post
next post