ఛత్తీస్ ఘడ్ రక్తమోడింది. మావోయిస్టులు పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టారు.
నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మరణించారు. ఒక మహిళా మావోయిస్టు కూడా మృతి చెందినట్లు తెలిసింది.
బీజాపూర్ జిల్లా టర్రెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ సందర్భంగా లో టర్రెం అడవుల్లో తప్పిపోయిన పోలీసు బలగాల గుర్తింపు కోసం సహాయ చర్యలు చేపట్టారు.
ఆ ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలించారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని బీజాపూర్ పోలీసులు తెలిపారు.