నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో, ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభి వృద్ధి సంస్థ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సంయుక్తంగా 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా తరగతుల కార్యక్రమంను, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు అధ్యక్షత వహించగా, ఉపకులపతి ఆచార్య యం చంద్రయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల దీప ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య చంద్రయ్య మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతుల వలన విద్యార్థులకు ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని, కాబట్టి అందరు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముఖ్య తిధి డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నైపుణ్యాభి వృద్ధి శిక్షణా కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో చేపడుతున్నారని తెలిపారు. దీనికోసం నైపుణ్యాభి వృద్ధి విశ్వవిద్యాలయంను ప్రారంభిస్తున్నారని, రాబోవు రోజులలో నైపుణ్యాభి వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోనుంది అని అన్నారు.
ప్రాంతీయంగా నెలకొని వున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా , శిక్షణా తరగతుల ప్రణాళిక రూపొందించామని, ప్రతి విద్యార్థి శ్రద్ధతో ఈ శిక్షణా తరగతులలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎపి నైపుణ్యాభి వృద్ధి సంస్థ జిల్లా అధికారి షైక్ అబ్దుల్ ఖయ్యుమ్, నైపుణ్యాభి వృద్ధి శిక్షణా సమన్వయకర్త డా. సి ఎచ్ విజయ, కో కన్వీనర్ డా. కె. విద్యా ప్రభాకర్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.