కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తీరందస్ బస్తి లో భారత ప్రభుత్వం నిర్దేశించిన స్కిల్ ఇండియా లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ వారి సౌజన్యంతో దుర్గం మారుతి ఆధ్వర్యంలో బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ కుట్టు శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ శిబిరంలో కుట్టు పని చక్కగా నేర్చుకొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు.