రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ 2022 క్యాలెండర్ ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేశ్ బి లాఠ్కర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. బోధనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్ధుల భవిష్యత్ కు దిక్సూచిల్లాంటి వారని అన్నారు. ఈ సందర్భంగా 30 నెలలుగా జీతాలు అందక బాధ పడుతున్న 2002 బాధిత హిందీ పండితులకు జీతాల చెల్లింపు దిశగా చొరవ చూపాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు ,కూన రంగ నాయకులు ,రఘు పాత్రనీ శ్రీనివాసరావు కోశాధి కారి నెయ్యల చంద్ర రావు, సహాధ్యక్షులు కుప్ప న్న గారి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులు, చింతపల్లి జనార్ధన రావు, గొడబ మేరీ ప్రసాద్, మహిళా కార్యదర్శి సంధ్యారాణి,బండారు రామ చంద్రరావు, లోలుగు ఆనందరావు, షేక్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
previous post