ఈ విఆర్ఏ కంప్యూటర్ పరిజ్ఞానం లో దిట్ట. ఈయన గ్రామంలో వి ఆర్ ఓ పరిధిలో విధులు నిర్వహించాలి. అలా కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా సెటిలయ్యాడు. భూములకు సంబంధించిన మార్పులు చేర్పులు ఈయన తోనే కంప్యూటర్ లో నమోదు చేయిస్తారని సమాచారం.
అందు వలన ఇతనికి కార్యాలయంలో కీలకమైన ఆన్ లైన్ ప్రక్రియ మొత్తం ఇతనికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు. రైతులకు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ ఇతని కనుసన్నలలోనే జరుగుతుందని తెలిసింది. మ్యుటేషన్ లు, ఆడం గల్ కరక్షన్ లు, ఈయన చేతుల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. మ్యుటేషన్ ల కోసం కార్యాలయానికి వచ్చిన రైతులతో బేరం మాట్లాడుకుని అధికారులకు రైతులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నా డని, రైతులనుండి పెద్ద మొత్తము లొనే మ్యుటేషన్ ల పేరుతో సొమ్ములు గుంజుతున్నట్టు సమాచారం.
అడిగినంత సొమ్ములు ఇవ్వని రైతుల మ్యుటేషన్ దరఖాస్తులు నెలలు తరబడి పెండింగ్ లో పెట్టి సొమ్ములు చేతికందాకే పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ లకు మోక్షం కలిగిస్తున్నారని తెలిసింది. ఈ వి ఆర్ ఏ తాహసీల్దార్ కార్యాలయములో కీలకమైన సెక్షన్ లో పని చేస్తూనే తాహసీల్దార్ గారికి డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడని కార్యాలయ సిబ్బంది చెప్పుకుంటున్నారు. శుక్రవారం మద్యాహ్నం ఓ రైతు కు ఆ వి ఆర్ ఏ కి మధ్య తహసీల్దార్ కార్యాలయంలో నే జరిగిన మాటల యుద్ధం జరగడం విశేషం. పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ తంతు జరుగుతున్నది….