కడపజిల్లా ఎర్రచందనం తమిళ కూలీల సజీవదహనం ఘటనలో అంతరాష్ట్ర స్మగ్లర్ బాషా బాయ్ ని సోమవారం ఎస్పీ అన్బు రాజన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాషా భాయ్ అసలు పేరు హకీమ్ అలీ అలియాస్ బాషా బాయ్ అని అతనితోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఘటనలో మొత్తం 5 మంది సజీవదహనం అయ్యారన్నారు. ఈ కేస్ ని చేధించడానికి ఐదు బృందాలు పనిచేశాయని తెలిపారు. సైబర్ టీం ఇచ్చిన కీలక సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు.
తమిళ కూలీలా ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే కోడూరులో ఇద్దరిని పట్టుకున్నామన్నారు. బకార పేటలో ఎర్రచందనం లోడ్ చేశారు. హకీమ్ అలీ అలియాస్ బాషా బాయ్ తమిళ కూలీలాతోను, వెనక వెంబడించిన కార్ లో ఉన్న వాళ్ళతో బాషా బాయ్ టచ్ లోనున్నాడని తెలిపారు.