ప్రయాణిస్తున్న కారులో మనుషులతో బాటు పాము ఉంటే? ఇంకేముంది ఒక్క సారిగా భయం పుట్టదూ…? అలానే జరిగింది
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో నాగుపాము కనిపించింది.
నాగు పామును చూసిన దంపతులు ఇద్దరు కారును ఆపి తమ చిన్నారితో కలిసి పరుగులు తీసారు.
కారులో పాము ఉన్నదని తెలుసుకున్న స్థానికులు స్నేక్ క్యాచర్ లను రప్పించి పామును పట్టుకున్నారు.
ఒ కుటుంబం షాద్ నగర్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.