దళితుల జనావాసాలలో విష సర్పాలు యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి యువసేన నాయకుడు, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి కె మాదిగ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ గ్రామంలో దళితులు నివసిస్తున్న ప్రాంతాలలో విష సర్పాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో దళితులు మాత్రమే ఉంటున్నారు కాబట్టి అధికారులతో బాటు సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
previous post