37.2 C
Hyderabad
March 29, 2024 20: 14 PM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్ లో అందరూ విజేతలే

#SnookerGame

సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్నూకర్ టోర్నమెంట్ లో పాల్గొన్న వారందరూ విజేతలేనని విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని స్నూకర్  పార్లర్ లో  ఆదివారం రాత్రి స్నూకర్ జిల్లాస్థాయి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో ధనవంతుల క్రీడ గా పేరుపొందిన స్నూకర్ ఇప్పుడు ఎంతగానో యువత ను ఆకర్షిస్తోందని తెలిపారు. ఈ టోర్నమెంట్ ను నిర్వహించిన రాహీల్ తాజ్ ను ఆయన అభినందించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ఆశీస్సులను క్రీడాకారులకు అందజేశారని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ టోర్నమెంట్ ను నిర్వహించిన రాహిల్ తాజ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఎందరో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 63 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇనుమడించిన ఉత్సాహాన్ని చూస్తుంటే మరెన్నో టోర్నమెంట్లు జరపాలని కోరిక ఉందన్నారు.

అప్పుడే ఈ క్రీడకు ప్రాచుర్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, శ్రీనివాస్, కోటేశ్వర్ రెడ్డి, మైనార్టీ నేతలు రబ్బాని, అతహర్ భాష రియాజ్  తదితరులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు:

నెల్లూరు జిల్లా స్థాయి స్నూకర్ టోర్నమెంట్లో ఎ. కృష్ణ సీనియర్స్ విభాగంలో విజేతగా నిలిచారు. రన్నర్స్ గా సాయి కృష్ణ, ఇమ్రాన్ నిలిచారు. జూనియర్స్ విభాగంలో వంశి విజేతగా నిలిచారు. రన్నర్స్ గా ఇర్షాద్, నిషిత్ గెలుపొందారు. బెస్ట్ బ్రేక్ అప్ స్థానాన్ని ఖాదర్, రాజ్ పొందారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నుంచి అంతర్జాతీయ క్రీడాకారుడు గా పేరు పొందిన పాండురంగయ్యను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫైనల్ మ్యాచ్ కు విచ్చేసి క్రీడాకారులను అభినందించారు.

Related posts

మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు సీఎం కేసీఆర్

Satyam NEWS

వివాదంలో కామారెడ్డి ఎమ్మెల్యే

Bhavani

శని, ఆది, సోమ…. మారిన ఉద్యోగ సంఘాల నేత మాటలు

Satyam NEWS

Leave a Comment