35.2 C
Hyderabad
April 20, 2024 16: 50 PM
Slider కృష్ణ

ఈ సాయంత్రం విజయవాడలో రామ్ లాల శోభాయాత్ర

#RamaMandir

ఉత్తరప్రదేశ్ నుండి తీసుకువచ్చిన “రామ్ లాల” విగ్రహాల రథోత్సవం(శోభా యాత్ర) ఈ రోజు ది.13-02-2021  సాయంత్రం నాలుగు గంటలకి విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ఒక ప్రకటనలో తెలిపింది.

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ కోసం నిర్వహించే శోభా యాత్రకు హిందూబందువులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు వారు తెలిపారు.

మర్యాదా పురుషోత్తముడు , జగదభిరాముడు , అయోధ్య రాముడు , మన రామయ్య తండ్రికి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ఈ సమయంలో జరగడం మన పూర్వ జన్మ సుకృతం. అలాగే శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో మనం భాగస్వామ్యం అవ్వడం మనందరి అదృష్టం అని వారన్నారు.

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్బంగా, మనందరి నిధి సమర్పణలో భాగంగా, ఉత్తరప్రదేశ్ నుండి తీసుకువచ్చిన “రామ్ లాల” విగ్రహాల రథోత్సవం(శోభా యాత్ర) ఈ రోజు ది.13-02-2021  సాయంత్రం నాలుగు గంటలకి మాచవరం దాసాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి నుండి బయలుదేరుతుంది.

కావున శ్రీరామ సేవకులు , శ్రీరామ భక్తులు , ఈ కార్యక్రమంలో భాగస్వాములై , శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ చేసి , అందరితో చేయించి , ఆ స్వామివారి రథోత్సవం జయప్రదం చేసి , అయోధ్య శ్రీరామ మందిరం కోసం చేసిన పోరాటాల చరిత్రను మన భావితరతరాలకూ అందించి స్పూర్తినిద్దాం అని విశ్వహిందూ పరిషత్ కోరింది.

Related posts

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

గార్ల మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహావిష్కరణ

Bhavani

అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ-పాస్ కు దరఖాస్తు చెయ్యండి…!

Satyam NEWS

Leave a Comment