కరోనా రెండో దశ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అదే ఒరవడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 45 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు.
వరంగల్ అర్బన్ లో 17 మందికి కరోనా సోకింది. వరంగల్ రూరల్ లో 6 కేసులు, జనగాంలో 6, జయశంకర్ భూపాలపల్లి 5, మహబూబాబాద్ 6, ములుగు 5 కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు.