37.2 C
Hyderabad
March 28, 2024 20: 28 PM
Slider ఆదిలాబాద్

సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు కొనాలి

nirmal social distencing

మ‌హామ్మారి కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మల్ ప‌ట్ట‌ణంలోని ఎన్టీయార్ స్టేడియంలో మంత్రి రైతు బ‌జార్, ఏరియా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డును ను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్బంగా  కూర‌గాయలు విక్ర‌యిస్తున్న రైతుల‌తో మాట్లాడారు. కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకు కూర‌లు సోషల్ డిస్టెన్స్  ను పాటించి, మున్సిపల్ వారు గీసిన గీతలో వుండి కొనుగోలు చేయాలన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. శానిటైజ‌ర్ల‌ను, మాస్కుల‌ను మార్కెట్ లో అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం  కిరాణ షాపుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి నుంచి  ఏరియా ఆసుప‌త్రికి వెళ్లి ఐసోలేష‌న్ వార్డును ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా  మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను ప్రజలందరూ పాటించి, ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి వారికి కావాలసిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలన్నారు.

ప్రజల రద్దీ దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్టీయార్  క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ లో పాల్గొనాలని, కర్ఫ్యూ సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేందర్, రాంకిష‌న్ రెడ్డి, ల‌క్కిడి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లో 100 ఇళ్లు నిర్మించుకున్న చైనా

Sub Editor

బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరం

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినా అడిగే దమ్ములేని జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment