కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెలకొందని, ప్రజలకు పోలీస్ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారని కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ అన్నారు. “పోలీసులు మీకోసం” కార్యక్రమం తిర్యాని మండలం, గుండాల గ్రామంలో శనివారం రోజున జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా జిల్లా ఎస్.పి కె.సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామస్తులకు నిత్యవసర సరుకులు, వృద్దులకు వాకర్స్, పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, ప్యాడ్స్, గ్రామ యువతకు వాలీబాల్ కిట్లు పంపిణి చేసారు. యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజల ధనమానప్రాణలను రక్షించటం లో పోలీసులు ముందుంటారని గ్రామ ప్రజలకు తెలియజేసారు.
ప్రజలకు ఎపుడూ ఏ సమస్య ఉన్న డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలి అని, లేని పరిస్థితులలో పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని అన్నారు. సహజ విస్తరాకుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. దీని ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామస్థులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్.పి అచ్చేశ్వర్ రావు, డి.ఎస్.పి ఆర్.శ్రీనివాస్, సి.ఐ నరేందర్, ఎస్.ఐ రమేష్, ఆర్.ఎస్.ఐ ఓదెలు, గ్రామ సర్పంచ్ జంగుబాయీ, ఎమ్.పి.టి.సి మెంగు బాయి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.