అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 365 రోజుల సందర్భంగా రాజంపేటలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బాత్యాల చెంగల రాయుడు అమరావతి రాజధాని సంఘీభావ దీక్ష నిర్వహించారు.
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం అమరావతి రాజధానికి మద్దతుగా టీడీపీ సంఘీభావ దీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
దీక్షలోమూడు రాజధాను లు వద్దు,ఒక్క రాజధాని ముద్దు అంటూ వినాదాలు చేశారు.365 రోజుల దీక్షలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వారికి నివాళి అర్పించారు.
అమరావతి రాజధాని సాధించే వరకు తాము రైతులకు అండగా ఉంటామని బత్యాల ప్రకటించారు.