తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాచిన కొల్లాపూర్ నియోజకవర్గం లోని సోమశిల గ్రామంలో జియో సెల్ టవర్ పూర్తయి 3 సంవత్సరాలు కావొస్తున్నా నేటికీ వాటి సేవలు అందుబాటులోకి రానందున ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి అన్నారు.
ఈ విషయం గురించి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు మోర పెట్టుకున్నా వాళ్లు కనీసం దాన్ని చుసిన పాపాన కూడా ఇప్పటి వరకు పోలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లు రవి, మాజీ ఎంపీ, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్ లు హైదరాబాద్ లోని అరణ్య భవన్ అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శోభ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
సప్తనది సంగమం సోమశిల పుణ్య క్షేత్రానికి రోజుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు, వస్తూవుంటారని వారు తెలిపారు.
అలాగే ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. జియో సెల్ కేబుల్ లైన్ అనుమతులు ఇచ్చే విషయంలో ఆమె సానుకూలంగా స్పందించారని డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఈ కార్యక్రమం లో సోమశిల మండల యూత్ ప్రెసిడెంట్ కంఠం మౌలాలి, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ కేతురి రంగస్వామి తదితరులు కూడా పాల్గొన్నారు.