తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్, వెర్సటైల్ ఆర్టిస్ట్ జె.డి.చక్రవర్తి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న తెలుగు-తమిళ-కన్నడ భాషా చిత్రం (తెలుగులో ‘ఇద్దరు’) తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది అందాల కథానాయకి సోని చరిష్ఠ.
ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సోనీ ‘ఇద్దరు’ చిత్రం గురించి మాట్లాడుతూ… ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధిక కుమారస్వామిలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది!!