కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీ నుంచి మకాం మార్చబోతున్నారు. బహుశ ఆమె గోవాకు గానీ చెన్నైకి గానీ నివాసం మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. సోనియాగాంధీ చాలా కాలంగా ఆస్త్మాతో ఇబ్బంది పడుతున్నారు.
అంతే కాకుండా ఆమెకు తరచూ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకుతున్నది. ఈ నేపథ్యంలో కాలుష్య ఢిల్లీలో ఉండటం కన్నా ఊరు మారిస్తే బాగుంటుందని డాక్టర్లు సూచించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దాంతో ఆమె ఢిల్లీ నుంచి బయలు దేరి గోవాకు వెళ్లాలా లేక చెన్నై వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఆమె తో బాటు రాహుల్ గాంధీ గానీ ప్రియాంక గాంధీగానీ ఉంటారు.