లాక్డౌన్తో కిర్గిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి చేర్చిన రియల్ హీరో సోను సూద్ అని ఐఐటీ -జేఈఈ, నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ ప్రశంసించారు. వలస కూలీల పాలిట దేవుడిగా పేరున్న సోనూ సూద్.. లాక్డౌన్తో కిర్గిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు.
కళాశాలలు మూతపడి నాలుగు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లోని నాలుగు మెడికల్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భయం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు.
అక్కడే చిక్కుకున్న మరికొంత మంది తెలుగు విద్యార్థులు.. సోషల్ మీడియా ద్వారా సోను సూద్కు తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వారికి విమాన టికెట్ ధరను కూడా తగ్గించి మొత్తం 176 మంది విద్యార్థులను విశాఖకు తీసుకువచ్చారన్నారు.