గుంటూరు జిల్లా లో మండల కేంద్రమైన రొంపిచర్లలోని రైల్వే స్టేషన్ ను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జియం గజానన్ మాల్యా పరిశీలించారు.
రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా న్యూ పిడుగురాళ్ళ నుండి శావల్యాపురం వరకు ఏర్పాటు చేసిన నూతన రైల్వేస్టేషన్లలో రైలు రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు.
న్యూ పిడుగురాళ్ళ నుండి శావల్యాపురం వరకు 45కోట్ల రూపాయలతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈ మార్గంలో రైళ్ళు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి దుర్గా ప్రసాద్ రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.