కడప జిల్లా నందలూరు ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామికి పల్లకీ సేవ వేడుకగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా మాడ వీధుల్లో ఊరేగింపు కొనసాగింది.
ఆదివారం రాత్రి ఉత్సవాలల్లో భాగంగా స్వామి వారు హంస వాహనం పై వీణా పాణి అలంకారంలో సరస్వతి దేవి గా దర్శన మిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు మేడా విజయ భాస్కర్ రెడ్డి,కల్యాణోత్సవ కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.