36.2 C
Hyderabad
April 18, 2024 12: 10 PM
Slider ఆధ్యాత్మికం

గరుడవాహనం పై శ్రీ సౌమ్యనాధ స్వామి….

#sowmyanatha

కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ఐదవ రోజు బుధవారం రాత్రి శ్రీ సౌమ్యనాధ స్వామి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.

నలు వైపులా భక్తులు చేతులెత్తి మొక్కుతుండగా గోవింద నామ ఘోషల నడుమ శ్రీ సౌమ్యనాధ స్వామి విహరించారు.

రాజంపేట వాసవీ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో కోలాటాలు,అన్నమయ్య సంకీర్తనలు, మంగళ వ్యాయిద్యాలు,బాణాసంచా కాల్పులు, బాజా బజంత్రీలు మ్రోగుతుండగా, భక్తుల నీరాజనాల మధ్య గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నందలూరు కు భారీగా భక్తులు తరలివచ్చారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ప్రాంగణం మొత్తం రంగు రంగు విద్యుత్ దీప కాంతులతో,తో మాలలతో, పుష్పాలతో అలంకరించారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు మేడా విజయ భాస్కర్ రెడ్డి, కల్యాణోత్సవ కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతుల పట్ల ప్రధాని పట్టనట్లు వ్యవహరించటం తగదు

Satyam NEWS

సర్ ప్రయిజ్: జర్నలిస్టు మూర్తికి ఇంకా తగ్గలేదా?

Satyam NEWS

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor

Leave a Comment