అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు హంస వాహణం పై వీణా పాణిగా భక్తులకు మాడ వీధుల్లో గ్రామోత్సవంలో దర్శన మిచ్చారు.
వివిధ రకాల పూలతో పట్టు వస్త్రాలతో వీణా పాణి ని నేత్రపర్వంగా అలంకరించారు.
మంగళ వాయిద్యాలు నడుమ ,భక్తుల గోవింద నామాల మధ్య ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో వీణా పాణి కి పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో భక్తి గీతాలకు,అన్నమయ్య కీర్తనలకు చిన్నారులకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి, సమన్వయ కర్త మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్ శర్మ, బాల సుబ్రమణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.