కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాహన సేవలో భాగంగా అయిదవ రోజు ఉదయం మోహిని అలంకారం లో శేషవాహనంపై మాడ వీధుల్లో విహరించారు. గోవింద నామాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు మేడా విజయ భాస్కర్ రెడ్డి,కల్యాణోత్సవ కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి మాజీ ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం సౌమ్యనాధుని సేవలో తరించే ఆదిశేషువునే వాహనంగా చేసుకోవడం భగవంతుని కరుణాముద్రకు తార్కాణం. శేషవాహనంపై మోహిని అలంకారంలో ఊరేగిన స్వామివారిని దర్శించు కునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిత్యం స్వామిసేవలో ఉండే ఆదిశేషునిపై సౌమ్య నాధుని వీక్షించడం ఎంతో పుణ్యదాయకమని భక్తుల నమ్మకం. పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.