ప్రతి యేటా వేలాది మంది భక్తుల సమక్షంలో వేడుకగా జరిగే కడప జిల్లా నందలూరు లో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా సోమవారం కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ రెండో రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.శాస్రోక్తం గా పండితులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్వజ పటారోహణం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.
బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రాత్రి యాలివాహనము, 30 ఉదయం పల్లకి సేవ రాత్రి హంస వాహనం,జులై 1 ఉదయం పల్లకి సేవ రాత్రి సింహా వాహనం,2 వతేది రాత్రి హనుమంతు వాహనం ,3 వతేది ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం ,4 వతేది ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్రప్రభ, 5 వతేది ఉదయం శ్రీదేవి, భూదేవిలతో సౌమ్యనాధ స్వామి కళ్యాణం వేడుకగా జరుగనున్నది. అదేరోజు రాత్రి అశ్వవాహన సేవ పై స్వామి వారు ఊరేగ నున్నారు. 6వతేది రథోత్సవం, చక్రాస్నానం, రాత్రి ధ్వజా అవరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.