గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ లను సోమవారం శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి ఎల్.రమేష్ నేతృత్వంలో సత్కరించారు.
ఓటింగ్ శాతం పెరగటానికి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు సత్పలితాలు ఇచ్చాయని ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ శాసపు జోగినాయుడు అన్నారు.
ఇదే ఒరవడిని కంటిన్యూ చేసి త్వరలో జరగనున్న మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు మరింత సమర్థవంతంగా జరపాలని వారు కోరారు. ఈ అభినందన సత్కార కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎస్.వి.రమణ, బి.అప్పలనాయుడు, జి.వి.నాగభూషణం, ఎం.ఏ. వి.సత్యనారాయణ, టెంక శ్రీనివాస్,జి .నర్సునైడు ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.