కడప జిల్లాలోని బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.పి.కుంట చెక్ పోస్టులో రెండు రోజుల క్రితం రూ.1.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడంలో తనిఖీల్లో కీలకపాత్ర పోషించిన ఎస్.పి.ఓ లను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.
కారులో బిల్లులేకుండా తీసుకెళ్తున్నభారీ మొత్తాన్నిస్వాధీనం చేసుకున్న కేసును రెండు రోజుల క్రిందట జిల్లా అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) ఎం.దేవిప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించి అభినందించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ బిజివేముల రఘురామిరెడ్డి, సి.ఎల్.వి ప్రసాద రావులను క్యాంపు కార్యాలయంలో అభినందించి నగదు రివార్డు అందచేశారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, డి.ఎస్.పి రవి కుమార్ పాల్గొన్నారు.