27.7 C
Hyderabad
March 29, 2024 02: 22 AM
Slider ఆదిలాబాద్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్ ను కలిసిన ఎస్పీ

#AdilabadPolice

అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలోని ముఖ్య కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా కాసేపు ఇరువురు అధికారులు జిల్లాలో శాంతిభద్రతలు, పెండింగ్ కేసుల వివరాల అంశాలపై చర్చించారు, జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్ పోలీసు కేసులను సత్వరమే పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ పి. గంగాధర్, రెండో పట్టణ సీఐ పోతారం శ్రీనివాస్, ఎస్సై ఎస్. ఏ బాకీ.,ఏఎస్ఐ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Related posts

 బిఆర్ఎస్  పార్టీలో భారీ చేరికలు

Murali Krishna

ఎంపీటీసీ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుదాం!

Sub Editor

ములుగు ఎస్ పిని కలిసిన సీఐ రవీందర్

Satyam NEWS

Leave a Comment