30.7 C
Hyderabad
April 17, 2024 01: 40 AM
Slider కరీంనగర్

తెలంగాణ వాదనను ప్రపంచానికి చాటిన ప్రో. జయశంకర్

sp rahul hegede praises profesar jayashankar sir

ప్రత్యేక తెలంగాణ వాదనను రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రపంచానికి ఎలిగెత్తిచాటిన చెప్పిన ఘనత ప్రో. ఆచార్య జయశంకర్ కె దక్కుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రో. ఆచార్య జయశంకర్ 86వ జయంతి వేడుకలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో ముందుగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది ప్రొ. జయశంకర్ చిత్రపటం వద్ద పూలను వుంచి తమ నివాళులను ఆర్పించారు.


ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రో.జయ శంకర్, కాని ప్రొ. జయశంకర్ సార్ మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సమయంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కృషి ప్రశంసనీయని,ప్రొ. జయశంకర్ కలలు కన్నట్లుగా ఓ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ సాధన తో పాటు, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి, సమసమాజ స్థాపన సాధించాలనే ప్రొ.జయశంకర్ కలలను సాకారం చేస్తామని ప్రొ. జయశంకర్ సార్ జయంతి రోజున మనమందరం ప్రతిజ్ఞ చేయాలని అయన కోరారుప్రొ. జయశంకర్‌కు నివాళులు అర్పించివారిలో ఆర్.ఐ అడ్మిన్ సంపత్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

మిస్ మ్యాచ్ ఆడియో ఫంక్షన్ లో ఆర్ధిక మంత్రి

Satyam NEWS

పౌరసత్వ చట్టంపై ఆగని నిరసనలు

Satyam NEWS

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఊపుమీదున్న టీడీపీ

Satyam NEWS

Leave a Comment