36.2 C
Hyderabad
April 25, 2024 21: 15 PM
Slider విజయనగరం

పోలింగ్ ను తీరుతెన్నుల‌ను ప‌రిశీలించిన…ఎస్పీ

#RajakumariIPS

ఇటీవలే అర్ధాంత‌రంగా విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర పాల‌క సంస్థ ఐద‌వ డివిజ‌న్ లో ఎన్నిక‌ల‌లో పోటీ చేయద‌ల‌చుకున్నఅభ్య‌ర్ది దుర్మ‌ర‌ణం చెందారు.దీంతో 10 న జ‌ర‌గాల్సిన 50 డివిజ‌న్ ల‌లో 49 డివిజ‌న్ లో మాత్రమే ఎన్నిక‌లు జ‌రిగాయి.

మిగిలిన ఆ ఒక్క 5 వ డివిజ‌న్ ఎన్నిక ముందుగా అనుకున్న  విధంగానే 12 వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌ర‌కు పోలింగ్ జ‌రుగ‌నుంది.ఈ మేర‌కు బాబామెట్ట ప్ర‌భుత్వ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న పోలింగ్ స‌ర‌ళిని  త్వ‌ర‌లో డీఐజీ చార్జ్ తీసుకోబోతున్న రాజ‌కుమారీలు సంద‌ర్శించారు.

న‌గ‌రంలోని 5 వ డివిజ‌న్ కు సంబంధించి దాసన్నపేట, బాబామెట్ట, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల బాలికోన్నత పాఠశాల లో ఓటు వేసేందుకు ఓట‌ర్లు బారులు తీరారు. ర‌మార‌మి ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఎస్పీ  రాజ‌కుమారీ…. పోలింగ్ కేంద్రాలను ప‌రిశీలించారు.

అలాగే క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వహ‌ర్ లాల్.కాగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలిని, దివ్యాంగురాలిని  అవ‌స్థ‌లు చూసి అక్క‌డే ఉన్న టూటౌన్ కానిస్టేబుల్ రాథిక‌… త‌క్ష‌ణం స్పందించి  రెవిన్యూ శాఖ ఏర్పాటు చేసి ల్ చైర్ పై తోటి సిబ్బంది స‌హాయం తీసుకుని ఆమెను ఓటు వేసుకునే చేసారు.

Related posts

స‌మ‌స‌మాజ స్థాప‌నే అంబేద్క‌ర్ ధ్యేయం: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

Satyam NEWS

ఒకే రోజు కరీంనగర్ లో 14 పార్కులను ప్రారంభించిన మంత్రి గంగుల

Satyam NEWS

బి ఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికులకు కట్టుబడి ఉంది

Satyam NEWS

Leave a Comment