పోలీస్ స్పందన లో కనిపించిన మానవీయ దృశ్యం…!
ఓ చంటి పిల్లను ఎత్తుకుని వచ్చిన తల్లి,…తన కన్నబిడ్డ జీవితాన్ని బాగుచేయమంటూ ఓ అమ్మ ఆవేదన….కట్టుకున్నోడే ఇంటి నుంచి తరిమేసాడంటూ ఓ ఆడబిడ్డ కన్నీటి వ్యధ…ఇవీ…విజయనగరం జిల్లా పోలీస్ అధికారిణి జిల్లా పోలీస్ బాస్ కు వద్దకు వచ్చిన ఆడబిడ్డల కన్నీటి వ్యధలు. ప్రతీ వారం మాదిరిగానే జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో స్పందన కార్యక్రమం నిర్వహించింది…జిల్లా పోలీస్ శాఖ.
డీసీఆర్ బీ సీఐ డా.వెంకటరావు సమక్షంలో జరిగిన ఈ స్పందన కార్యక్రమానికి ఎస్పీదీపికా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వారంలో ఒక రోజు జరిగే స్పందనలో మా మొరను ఎస్పీ అమ్మ ఆలకిస్తారంటూ సదూర ప్రాంతాల నుంచీ ఎందోర మహిళలు, ఆడిబిడ్డలు…తల్లులు, పోలీస్ కార్యాలయపు ఆవరణలో జరిగే స్పందనకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ తల్లి…తన కన్నబిడ్డ.ఆమె కన్న బిడ్డ తో ఎస్పీ ముందు తన గోడు ను చెప్పుకుంది.
బాధితులు చెబుతున్న వేదనలనకు ఎస్పీ మనసు చలించిపోయింది. వెంటనే…దాన్ని నుంచి తేరుకుని….సంబంధిత పోలీసులతో మాట్లాడతానని చెప్పి…ఆ ఫిర్యాదును డీసీసీఆర్ సీఐ డా.వెంకటరావుకుఇచ్చిన…వారం రోజుల్లో సమస్య పరిష్కారం నాకు చూపాలని ఆదేశించారు.
ఇలా ఈ వారంస్పందనలో దాదాపు 24 పిటిషన్లు వచ్చాయి.ఈ మేరకు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ,, ఎస్బి సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు ఎస్ఐ కృష్ణవర్మ,పీఆర్ ఓ కోటేశ్వరరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.