కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు స్వామివారి స్పర్శ దర్శనం అవకాశం కల్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్పర్శ దర్శనానికి, గర్భాలయ అభిషేకాలను తిరిగి పునరుద్ధరించారు.
ఇక అభిషేక సేవ కర్తలకు కూడా స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామని కూడా ఈవో తెలిపారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమయాలలో 22.02.22 నుండి 4.03.22 వరకు కు స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు. అదేవిధంగా గురు శుక్రవారాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తారు.