చూపులేని వారి కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త యాప్ను రూపొందించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు ఈ మని(ఎంఏఎన్ఐ) యాప్ను ఆవిష్కరించారు. మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ యాప్ ద్వారా చూపులేని వారు కరెన్సీ నోట్లను గుర్తించడం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మని యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారతీయ కరెన్సీ నోట్లపై అనేక ఫీచర్లు ఉంటాయని, అంధులు కూడా నోట్లను గుర్తించే విధంగా యాప్ను రూపొందించామని శక్తికాంత్ దాస్ తెలిపారు.
previous post