పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నం నగరానికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసుప్రారంభిస్తున్నారు.
డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్ ను విశాఖపట్నం నగరానికి ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట ఏ పీ ఎస్ ఆర్ టి సి డిపో డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ తెలిపారు.
ఈ బస్సు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం (27-03-2021) ఈ బస్సు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ బస్ ను ప్రారంభిస్తారని డిపో మేనేజర్ తెలిపారు.