బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోన్ కుక్కల సంరక్షణ కేంద్రాన్ని “హై లెవెల్ కమిటీతో ” కలసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్స్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని కావున ఆ సమయంలో స్పెషల్ డ్రైవ్ కింద కుక్కలను పట్టుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశించారు. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం అధికారులు హడావిడి చేయడం కంటే మందు జాగ్రత్త చర్యలు తీసుకొని వీధి కుక్కల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్