39.2 C
Hyderabad
March 28, 2024 16: 38 PM
Slider ముఖ్యంశాలు

ఆయనకు మతి స్థిమితం లేదు… అయితేనేం…

#KamareddyDt

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఓ  అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జాతీయ జెండాను స్థానిక నాయకులు ఎగురవేసి జాతీయ గీతం ఆలపిస్తున్నారు.

ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ మతిస్థిమితం లేని వ్యక్తి  ఒకేసారి రోడ్డుపై నిల్చుని జాతీయ జెండాకు వందనం చేసి  గీతాలాపన అయ్యే అంత వరకు నిల్చుండడం పలువురిని ఆకట్టుకుంది. దీంతో పలువురు ఆయన తీరును అభినందిస్తున్నారు.

గత కొన్ని రోజుల నుండి ఆయన మండల కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగుతున్నాడు. ఆయన రాత్రివేళల్లో మాత్రం బీసీ బాలుర హాస్టల్ పక్కన గల  షాధిఖాన భవనంలో  నిద్రిస్తున్నట్లు చూసినట్టు పలువురు తెలిపారు.

ఏదేమైనప్పటికీ మతిస్థిమితం  లేకున్నా   జాతీయత ఆయన లో కనిపించడం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.

Related posts

వేలెంటైన్స్ డే సందర్భంగా వి లవ్ బ్యాడ్ బాయ్స్ ఫస్ట్ లుక్

Satyam NEWS

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

Satyam NEWS

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న సిసోడియా

Satyam NEWS

Leave a Comment