ప్రజలకు ఏదైనా వార్త చేరాలంటే పేపర్ మాధ్యమం గా ప్రతీ ఒక్కరూ ఎంచుకుంటారు. ప్రస్తుత ఈ ఏండ్రాయిడ్ యుగంలో అరచేతిలో నే యావత్ ప్రపంచాన్ని చూసే స్థాయి కి సగటు వ్యక్తి ఎదగడంతో అంతా ఆన్ లైన్ లోనే వచ్చే స్తుంది.దీన్ని గుర్తించి…ఆన్ లైన్ న్యూస్ లో తనకంటూ ఓ ముద్రేసుకుని రేటింగ్ లో దూసుకెళుతున్న “సత్యం న్యూస్. నెట్”..సరిగ్గా ఇలాంటి ఆన్ లైన్ న్యూస్ కు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ను ఇచ్చింది… విజయనగరం ఆర్టీఓ శాఖ. రోడ్ సేఫ్టీ తో అటు ప్రజలకు, ఇటు వాహనదారులకు భద్రతా పరమైన అంశాలపై… ఆర్టీఓ ఆదినారాయణను..”సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి ఇంటర్వ్యూ చేసారు. ఇరువురు మధ్య రోడ్ భద్రత అలాగే నివారణ చర్యలు కు సంబంధించి సంభాషణల సారం చూడండి.
ప్రతినిధి-రోడ్ భద్రత పై తీసుకుంటున్న చర్యలేంటి..?
ఆర్టీఓ-ప్రతీ ఒక్కరూ రూల్స్ తెలుసుకుని రోడ్ మీదకు రావాలి.
ప్రతినిధి-ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు… భద్రతా పరంగా…!
ఆర్టీఓ-బైక్ కాగితాలతో పాటు ఇన్సూరెన్స్ ఉంచుకోవాలని…వాహనం కు లైట్ తప్పనిసరిగా ఉండాలి.వెంట లైసెన్స్ ఉండాలి.
ప్రతినిధి-వేగం ఎంతుండాలి…ఎంతలో వెళ్లాలి…?
ఆర్టీఓ-ఇద్దరు కన్నా ఎక్కువగా ఉండకూడదు… అంతకు మించి వెళితే… శాఖ… వెంటనే పోలీస్ శాఖ కు వాహనం నెంబర్ ను సెండ్ చేస్తుంది.
ఇలా రోడ్ భద్రత పై ఆర్టీఓ ఆదినారాయణ మాట్లాడుతూ… “సఫార్”లో భాగంగా రోడ్ భద్రత పై అనునిత్యం మా ఇన్ స్పెక్టర్లు ద్వారా… వాహనదారులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. ఇంకా ఆయనేం మాట్లాడారో చూడండి.