కమిషనర్ ను కోరిన బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఈ నెల 12 న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే 27.03.2021 నాడు జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ విషయంలో మద్దతు ఇచ్చిన వారు, వ్యతిరేకించిన వారు, కౌన్సిల్ సమావేశానికి హాజరైన వారి వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.
అనంతరం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. తమకు తెలియకుండా ముసాయిదా తయారు చేయడమే కాకుండా తాము తీర్మానానికి మద్దతిచ్చినట్టుగా చెప్పడంతో రైతులు తమను నిలదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల గడువు రేపటితో ముగుస్తున్నందున ఎల్లుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.