25.7 C
Hyderabad
May 24, 2025 08: 24 AM
Slider నల్గొండ

అయోధ్య కు సంఘీభావంగా స్థానిక ఆలయంలో పూజలు

#Venugopalaswamy Temple

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  శ్రీ వేణుగోపాల శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చైర్మన్ ముడుంబ జగన్నాథాచార్యులు విజ్ఞప్తి మేరకు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు 108 ప్రమిదలతో ప్రత్యేక దీపారాధన చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టటం శుభ పరిణామం అని, దేశంలో ఎటువంటి కరువు కాటకాలు లేని సుభిక్షమైన రామ రాజ్య స్థాపన ఏర్పడాలని అన్నారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రముఖులు బొంత రామిరెడ్డి, గుండా కాంతయ్య, కామిశెట్టి కిరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

సురక్షితమైన సమాజం లక్ష్యంగా సిసి కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

4న విజయవాడకు రాష్ట్రపతి

Murali Krishna

New Game Started: తెరాస లోకి పెద్దిరెడ్డి: బీజేపీ లోకి ఈటెల

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!