ఉప్పల్ నియోజకవర్గం కప్రా సర్కిల్ జలమండలి కార్యాలయంలో నూతనంగా ప్రతిష్టించిన అమ్మవారి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమలా నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కార్పొరేటర్ పాల్గొని దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ నాయకులు బాల్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,బత్తుల శ్రీకాంత్,శ్రీకాంత్ రెడ్డి,బాబు గంగపుత్ర,పరశురాం గౌడ్,సాయి బాబా గౌడ్,రాఘవ రెడ్డి మరియు ఏఎస్ రావు నగర్ డివిజన్ నాయకులు మహిపాల్ రెడ్డి,బాలరాజు,కొత్త అంజి రెడ్డి, రాఘవరెడ్డి,మనెమ్మ,శిరీష,రాజిరెడ్డిరాజు,పులిచేరలు,మురళి పంతులు తదితరులు పాల్గోన్నారు.