శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానములో తే13-04-2021దీ మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అమ్మవారికి తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహాక్షిరాభిషేకం సేవ, నిత్య పూజలు, సహస్త్రనామార్చనా పూజ సేవ, పుష్ప అలంకరణ సేవ నూతన పంచాంగము పూజ పంచాంగము శ్రవణము విశేష హోమంలుకుంకుమ పూజ , శ్రీ లలిత సహస్త్రనామా పారాయణం, లక్ష కుంకుమార్చన పూజ మహానివేదన మహా హారతి వేద ఆశీర్వచనము వేద పారాయణం ఉంటాయి.
ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మాస్క్ ధరించి అమ్మవారిని దర్శించుకుని కోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ కోరారు.