ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానములో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.
అమ్మవారికి తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహాక్షిరాభిషేకం సేవ, నిత్య పూజలు, సహస్త్రనామార్చనా పూజ సేవ, కుంకుమ పూజ నిర్వహించారు.
శ్రీ లలిత సహస్త్రనామా పారాయణం నిర్వహించి, లక్ష కుంకుమార్చనపూజ మహానివేదన మహా హారతి వేద ఆశీర్వచనం చేశారు.
వేద పారాయణం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు భక్తులు ఉదయం నుండి కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి ఉద్యాపనలు, మొక్కబడులు జరిపించుకున్నారు.
కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.