కడప జిల్లా రామాపురం మండలం హసనపురం శివాలయంలో సోమవారం జరిగిన కార్తీక మాసపు పూజల్లో ప్రభుత్వ చీఫ్ వి ప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పూజారులు శ్రీకాంత్ రెడ్డి తో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు.
ఆయనకు తీర్థప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. ప్రజలందరూ సుఖ శాంతులుతో ఉండాలని , కరోనా మహమ్మారి త్వరితగతిన పూర్తిగా అంతం కావాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి పనులపై ఆలయ కమిటీ తోనూ, గ్రామస్థులు తోనూ శ్రీకాంత్ రెడ్డి చర్చించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు సుదీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత భూషణ్ రెడ్డి, పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగభూషన్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు ఎర్రమరెడ్డి, రవీంద్ర, నరసింహా, ఫక్కీరా రెడ్డి, బలనాగిరెడ్డి, శివయ్య, చంద్ర తదితరులు పాల్గొన్నారు.