వ్యాసరూపాయ విష్ణమే. నమోబ్రహ్మదేవాయ…నమోనమో….ఈ శ్లోకం ఒక్కసారి పఠినం చేస్తే….వ్యాస భగవానులు సాక్షాత్ విష్ణు అవతారమేనని అర్ధమవుతోంది. అటువంటి వ్యాస భగవానుడు జన్మించిన పుణ్య ప్రదేశం…ఈ భారతదేశం. ఎన్నో వేల సంవత్సరాల నుంచీ ఋషులు, మునులు, మరెందో మహానుభావుల పుట్టిన కర్మ భూమి ఈ భారత దేశం. మహాభారత ,రామాయణ, గ్రంధాలను అవపోసన మహా ఋషి,ఆది గురువు వేద వ్యాసుడు. ఆ ఆది గురువైన వ్యాసుడు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్నుకు వచ్చి ఉన్నారని అక్కడి స్థల పురాణం చెబుతోంది.
అక్కడే వారి పేరు మీదే వ్యాసాశ్రమం ఒకటి ఇప్పటికీ ఉండటం విశేషం. ఆది గురువు వేద వ్యాసుడు ఎన్నో వేళ సంవత్సరాల క్రితం ఈ దేశంలో ప్రతీ చోట సంచరించారనేది అక్కడక్క ఆధారాల ద్వారా అటు పురావస్తు శాఖ, ఇటు పర్యాటక శాఖల బట్టి ఈ లోకానికి తెలుస్తునే ఉంది. అదే వేద వ్యాసుని పేరుతో ఏపీ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో నాటి బ్రిటిష్ కాలం నుంచీ అటు పిమ్మట రాజు వంశీయుల కాలంలో పురాతన విజయనగరంలోని నెల్లిమర్ల వెళ్లే దారిలోనూ,అటు కుమిలి వైపు దగ్గరలో ఓ మెట్టకు వచ్చేవారిని అది క్రమక్రమేనా వ్యాసనారాయణ మెట్టగా ఖ్యాతి పొందిందని అక్కడి స్థల పురాణం చెబుతోంది.
ప్రస్తుత ఆధునిక యుగంలో అందులో ఈ స్మార్ట్ కాలంలో జిల్లా నడిబొడ్డున ఉన్న ఎన్నో వందల నాటి చరిత్ర ఉన్న కలిగిన వ్యాసనారాయణ మెట్ట గురించి ఆన్ లైన్ జర్నలిజంలో శరవేగంగా దూసుకెళుతున్న సత్యం న్యూస్.నెట్ పరిశోధన చేసింది. వ్యాసుడు అదే మెట్టపై నాటి బ్రిటిష్ కాలం నుంచీ ఆ తర్వాత రాజుల వంశంలో విశిష్టంగా పేరొందిందా వ్యాసనారాయణ మెట్ట. ఆదే వ్యాసనారాయణ మెట్ట..తదనంతర పరిణమాలలో ఏ విధంగా అభివృద్ది చెందింది..? అస్సలు పాలకులు,ప్రభుత్వాలు ఎంత మేరకు పట్టించుకున్నాయో అన్న అంశాన్ని సత్యం న్యూస్.నెట్ ప్రతినిధి పరిశోధన చేసారు.
వ్యాసనారాయణ మెట్ట పై సత్యంన్యూస్.నెట్ పరిశోధనాత్మక వ్యాసంలో ఇది తొలి భాగం
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్